ఏపీ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 184 కొత్త కేసులు నమోదయ్యాయి

Update: 2021-12-07 13:27 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 184 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,74,036 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,455 మంది మరణించారు.

యాక్టివ్ కేసులు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,57,573 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,008 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,06,19,555 నమూనాలను పరీక్షించారు


Tags:    

Similar News