నేడు బీజేపీ జనాగ్రహ సభ...వైసీపీయే లక్ష్యంగా...?

బీజేపీ నేడు విజయవాడలో బహిరంగ సభను నిర్వహివంచనుంది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ ఈ సభను నిర్వహిస్తుంది.

Update: 2021-12-28 02:43 GMT

భారతీయ జనతా పార్టీ నేడు విజయవాడలో బహిరంగ సభను నిర్వహివంచనుంది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ ఈ సభను నిర్వహిస్తుంది. జగన్ పాలనలో జరుగుతున్న అవినీతి, పోలీసుల వ్యవహారశైలి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించడం వంటి అంశాలపై బీజేపీ ఈ బహిరంగ సభను నిర్వహించనుంది. దీనికి జనాగ్రహ సభగా నామకరణం చేశారు. ముప్ఫయి నెలల్లో జగన్ పాలనపై ఈ సభను నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

కేంద్ర మంత్రి....
ఈ సభకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిధిగా రానున్నారని తెలుస్తోంది. అమిత్ షా డైరెక్షన్ మేరకు బీజేపీ రాష్ట్ర నేతలు ఈ సభను నిర్వహిస్తున్నారు. బెజవాడలో జరిగే ఈ సభ ద్వారా వైసీపీ ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని చెప్పడమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. తాము టీడీపీకి, వైసీపీకి సమాన దూరమని చెప్పే ప్రయత్నం ఈ సభ ద్వారా చేస్తారంటున్నారు.


Tags:    

Similar News