వంద కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీలు

వంద కోట్ల రూపాయలతో మూడు పాలిటెక్నిక్ కళాశాలలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

Update: 2023-03-21 05:08 GMT

విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను మరింత చేరువ చేయడానికి ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వంద కోట్ల రూపాయలతో మూడు పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యువత తమ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఈ కళాశాలలు ఉపయోగపతాయని ప్రభుత్వం చెబుతుంది.

సీమ ప్రాంతంలోని...
నంద్యాల జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, కడప జిల్లాలోని మైదుకూరులో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్ వంటి కోర్సులుంటాయని చెబుతున్నారు. ఈ కోర్సులు చదివి ఉపాధి అవకాశాలను వెంటనే అందిపుచ్చుకునే వీలుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.


Tags:    

Similar News