ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 176 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 176 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,77,321 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,495 మంది మరణించారు.
యాక్టివ్ కేసుల సంఖ్య....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,61,599 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,227 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,13,57,848 నమూనాలను పరీక్షించారు