ఏపీలో రోజురోజకూ పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 547 కొత్త కేసులు నమోదయ్యాయి

Update: 2022-01-06 12:43 GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు రోజురోజుకూ బాగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 547 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,78,923 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,500 మంది మరణించారు.

యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,62,157 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,266 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,14,92,070 నమూనాలను పరీక్షించారు


Tags:    

Similar News