ప్రపంచ ప్రఖ్యాత ఆడి, బెంజ్ వంటి కంపెనీలకు చెందిన కార్లకు వారు వాడే ఇంటీరియర్స్ ను సరఫరా చేసే కంపెనీ ఏపీలో తమ ఉత్పాదక యూనిట్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు , ప్రపంచంలోనే ఆటోమొబైల్ ఇంటీరియర్స్కు ప్రఖ్యాతిగాంచిన అంటోలిన్ ఇంజినీరింగ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమన్యారు.
ఆడి, మెర్సిడిస్ వంటి దిగ్గజ కార్లకు ఈ సంస్థ తయారు చేసిన ఇంటీరియర్ పరికరాలు వినియోగిస్తున్నారు. పూనె, చెన్నైలలో ప్రస్తుతం ఈ సంస్థకు తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమరావతిలో నూతనంగా తమ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి అంటోలిన్ ఇంజినీరింగ్ గ్రూప్ సుముఖంగా వుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించి మేధా టవర్స్లో డిజైనింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రారంభించాలని భావిస్తోంది.
తొలుత 120 మందితో ప్రారంభించి 400 మంది వరకు దశలవారీగా ఉపాధి కల్పిస్తామని అంటోలిన్ ఇంజినీరింగ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు.
స్థానిక విశ్వవిద్యాలయాల్లో జర్మన్, స్పానిష్ భాషలను అభ్యసించేందుకు కోర్సులను ప్రవేశ పెడితే సంబంధాలు బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ఈ సందర్భంగా వివరించిన ముఖ్యమంత్రి, అంటోలిన్ గ్రూప్ తమ పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అమరావతిని ఎంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.