జగన్ మూతికి మాస్క్ మూడు నిమిషాలనా ఉందా?

ఆంధ్రప్రదేశ్ లో గణేష్ పండగ పై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అభ్యంతరం తెలిపారు. అన్ని పండగలకు అనుమతి ఇచ్చి, ఈ ఒక్క [more]

Update: 2021-09-06 07:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో గణేష్ పండగ పై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అభ్యంతరం తెలిపారు. అన్ని పండగలకు అనుమతి ఇచ్చి, ఈ ఒక్క పండగకే ఆంక్షలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. చర్చిలోలేని కరోనా ఇప్పుడు ఎందుకు వచ్చిందని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మూతీకి మూడు నిమిషాలు మాస్క్ ఉండటం ఎప్పుడైనా చూశామా? అని నిలదీశారు. తెలంగాణలో లేని ఆంక్షలు ఇక్కడ వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు ఎందుకని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అప్పలరాజులు యాభై వేల మందితో మీటింగ్ పెడితే కరోనా రాదా? అని రఘురామ కృష్ణరాజు నిలదీశారు. హిందువుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News