బ్రేకింగ్ : మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

మంత్రి మల్లారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్బుల్లా పూర్ మండలం సూరారం గ్రామంలో 2 ఎకరాల 13 కుంటల భూమిలో కొంత భాగాన్ని కబ్జా [more]

Update: 2020-12-08 14:46 GMT

మంత్రి మల్లారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్బుల్లా పూర్ మండలం సూరారం గ్రామంలో 2 ఎకరాల 13 కుంటల భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేశారంటూ శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన లాయర్ మల్లారెడ్డికి అమ్ముడు పోయి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరిస్తున్నారని శ్యామల పోలీసులకు తెలిపారు. ఇరవై కుంటల భూమిని ఆక్రమించి మల్లారెడ్డి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంత్రి మల్లారెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News