ఇసుక పోయె…ఉల్లి వచ్చె

ఇసుక సమస్య తీరడంతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉల్లిపాయల మీద పడ్డారు. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్నా ఏపీలో మాత్రం ఉల్లి ధరలు [more]

Update: 2019-12-04 14:57 GMT

ఇసుక సమస్య తీరడంతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉల్లిపాయల మీద పడ్డారు. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశన్నంటుతున్నా ఏపీలో మాత్రం ఉల్లి ధరలు పెరగడానికి జగన్ ప్రభుత్వమే కారణమంటున్నారు చంద్రబాబు. సరైన ముందుచూపు లేకనే జగన్ ప్రభుత్వం ఉల్లిని నిల్వ చేయలేకపోయిందన్నారు. జగన్ ప్రభుత్వానికి భవిష్యత్తు గురించి ఆలోచనే లేదన్నారు చంద్రబాబు. రైతు బజార్లో కిలో ఉల్లిపాయల కోసం క్యూలో నిల్చోవాలా? అని ప్రశ్నించారు చంద్రబాబు.మరి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగడానికి కూడా జగన్ అవగాహన లోపమే కారణమేమో. పవన్ కల్యాణ్ సయితం ఉల్లి ధరలు పెరగడానికి జగన్ కారణమని విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News