అక్టోబర్ లో పీక్ స్టేజ్ కి కరోనా

దేశంలో అక్టోబర్ నెల నాటికి కరోనా వైరస్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి నివేదిక అందించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ [more]

Update: 2021-08-23 07:07 GMT

దేశంలో అక్టోబర్ నెల నాటికి కరోనా వైరస్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి నివేదిక అందించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిటీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే థర్డ్ వేవ్ లో ఇది పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వారు నివేదికలో పేర్కొన్నారు. పిల్లలకు అవసరమైన చికత్స, వెంటిలేటర్లు, ఆక్సిజన్ వంటివి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో కమిటీ సూచించింది. పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తే మంచిదని కమిటీ తెలిపింది.

Tags:    

Similar News