మోడీ బిజీ...బిజీ

ఇండోనేషియా పర్యటన నుంచి ప్రధాని మోడీ గురువారం దేశానికి తిరిగి వచ్చారు. జీ 20 సదస్సు కోసం వచ్చిన ప్రపంచ నేతలను ఆహ్వానించడంలో ప్రధాని నరేంద్ర మోడీ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు

Update: 2023-09-08 16:33 GMT

మోడీ బిజీ...బిజీ

ఇండోనేషియా పర్యటన నుంచి ప్రధాని మోడీ గురువారం దేశానికి తిరిగి వచ్చారు. జీ 20 సదస్సు కోసం వచ్చిన ప్రపంచ నేతలను ఆహ్వానించడంలో ప్రధాని నరేంద్ర మోడీ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. సదస్సులో పాల్గొనడానికి వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోను, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్ తో వేర్వేరుగా ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మోడీ తన నివాసంలో జో బైడెన్ ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు. అదే సమయంలో వారి మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. అణుశక్తి, రక్షణ ఒప్పందాలపై చర్చిస్తారు. అంతేకాకుండా, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, బ్యాంకుల్లో సంస్కరణలతోపాటు రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై కూడా చర్చిస్తారని వైట్ హౌస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో భద్రత , దౌత్యపరమైన సవాళ్లు, ఇతర ఆర్థిక అంశాలు చర్చకు రావచ్చు.

ఇప్పటికే భారత్ కొన్ని అమెరికా ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాన్ని ఎత్తి వేసింది. వీటిలో శనగలు, ఉలవలు, యాపిల్స్, వాల్ నట్స్, బాదం ఉన్నాయి. భారత్ ఉక్కు, అల్యూమినియంపై యూఎస్ టారిఫ్ పెంచడంతో, భారత్ అదనపు సుంకాలను పెంచింది.

‘వివిధ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం’ అని మోడీ ట్విట్టర్లో తెలిపారు.



15 మంది దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు

G20 సదస్సు సందర్భంగా ప్రధాని దాదాపు 15 మంది దేశాలనేతలతో వేరువేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, క్యామెరాస్, టర్కీ, దక్షిణ కొరియా, యూఏఈ, నైజీరియా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ నాయకులతో మోడీ వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఈ 15 ద్వైపాక్షిక సమావేశాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు వేరువేరు సమయాల్లో జరగనున్నాయి.

శనివారం కార్యక్రమాలు

ప్రధాని మోడీ శనివారం మధ్యాహ్నం బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో, జపాన్ ప్రధాని ఫ్యుమియొ కిషిదా తోనూ వేరువేరుగా సమావేశం కానున్నారు. అదే రోజు ఇటలీ ప్రధాని జర్జియా మెలోనీతో కూడా ప్రధాని సమావేశం అవుతారు. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో కూడా ప్రధాని శనివారమే ప్రత్యేకంగా భేటీ అవుతారు.

ఫ్రాన్స్, కెనడా అధిపతులతో ప్రధాని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తో ఆదివారం లంచ్ లో పాల్గొంటారు. అలాగే కెనడా ప్రధాని జస్టి న్ ట్రూ డో తో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. జీ 20 సదస్సులో పాల్గొనడం కోసం వివిధ దేశాల నుంచి అధినేతల రాక ప్రారంభమైంది. జీ 20 ని 1999లో ఏర్పాటు చేశారు. నాటి నుంచి భారత్ జీ 20 కి అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి. అధ్యక్ష హోదాలో జీ 20 సదస్సును ఇప్పుడు భారత్ ఢిల్లీలో నిర్వహిస్తోంది.

Tags:    

Similar News