తెలంగాణలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 205 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 205 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,77,546 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,002 మంది మరణించారు.
హైదరాబాద్ లోనే....
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే 77 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,69,673 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,871 ఉన్నాయి.