తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 203 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 203 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. నిన్నటి వరకూ రెండు వందలకు దిగువనే నమోదయిన కేసులు నేడు పెరగడంతో ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,77,341 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,001 మంది మరణించారు.
కోలుకున్న వారు....
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే 73 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,69,488 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,779 ఉన్నాయి.