తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 213 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు

Update: 2021-12-05 02:28 GMT

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 213 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. నిన్నటి వరకూ రెండు వందలకు దిగువనే నమోదయిన కేసులు నేడు పెరగడంతో ఆందోళన కల్గిస్తుంది. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,76,787 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 3,998 మంది మరణించారు.

కోలుకున్న వారు....
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,69,010 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,779 ఉన్నాయి.


Tags:    

Similar News