తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 190 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు

Update: 2021-12-14 01:15 GMT

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 190 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,78,478 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,008 మంది మరణించారు.

యాక్టివ్ కేసులు...
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే 70 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,70,246 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,837 ఉన్నాయి.


Tags:    

Similar News