పెరుగుతున్న యాక్టివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఒక్కరోజులోనే 484 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎటువంటి మరణాలు సంభవించలేదు

Update: 2022-06-30 03:00 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఒక్కరోజులోనే 484 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఇటీవల వారం రోజుల నుంచి తెలంగాణలో కరోనా కేసులు రోజుకు 450 కి పైగానే నమోదవుతున్నాయి. అయితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంది. హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన జలుబు, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎనిమిది లక్షలకు....
ఇప్పటి వరకూ తెలంగాణలో 8,00,476 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 7,91,944 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 4,421 యాక్టివ్ కేసులున్నాయి. నమోదయిన 484 కేసుల్లో 257 హైదరాబాద్ నగరంలో నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News