తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 462 కరోనా కేసులు నమోదయ్యాయి

Update: 2022-07-02 04:03 GMT

తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 462 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. అయితే ఇదే సమయంలో ఒక్కరోజులో 403 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వరసగా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలుండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రజలు మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానాను ఇప్పటికే ప్రభుత్వం విధించింది. అయినా ప్రజలు మాత్రం కరోనా నిబంధనలను పట్టించుకోవడం లేదు.

యాక్టివ్ కేసులు..
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,01,406 మంది కరోనా బారిన పడ్డాని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 7,92,593 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 4,702 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 4,111 మంది మరణించారు. నమోదయిన 462 కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 259 కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News