పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించిన జింబాబ్వే

Update: 2022-10-27 14:40 GMT

మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జింబాబ్వే పవర్ ప్లే ను ధాటిగా మొదలుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత పెద్దగా మిగిలిన వాళ్లు రాణించకపోవడంతో రన్ రేట్ కాస్తా తగ్గిపోయింది. పాక్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ వెళ్లిపోవడంతో.. స్కోర్ బోర్డు వేగంగా ముందుకు వెళ్లలేకపోయింది. ఇక జింబాబ్వే సంచలనం సికందర్ రజా విఫలమవడంతో జింబాబ్వే మంచి స్కోర్ సాధించలేకపోయింది. మొహమ్మద్ వసీమ్ జూనియర్ 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. హారిస్ రావూఫ్ 1 వికెట్ తీసుకున్నాడు.

ఛేజింగ్ లో పాకిస్థాన్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బాబర్ ఆజమ్ మరోసారి విఫలమయ్యాడు. 9 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మంచి టచ్ లో కనిపించిన రిజ్వాన్ ఒక సిక్సర్, ఒక ఫోర్ మాత్రమే కొట్టి.. 14 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక షాన్ మసూద్ ఒక్కడే జట్టును కాపాడడాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. 38 బంతుల్లో 44 పరుగులు చేసిన మసూద్ స్టంప్ అవుట్ అవ్వడం మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఇఫ్తికార్ అహ్మద్ 5 పరుగులు, షాదాబ్ ఖాన్ 17, హైదర్ అలీ డకౌట్ గా వెనుదిరిగారు. ఆఖర్లో మొహమ్మద్ నవాజ్ 22 పరుగులు, మొహమ్మద్ నవాజ్ జూనియర్ 12 పరుగులతో మ్యాచ్ ను పాక్ వైపు తిప్పినా.. ఆఖరి రెండు బంతుల్లో వికెట్ పడడం.. ఆఖరి బంతికి విజయానికి 3 పరుగులు కావాల్సి ఉండగా.. కేవలం ఒక్క పరుగే రావడంతో పాక్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. సికందర్ రజా మూడు వికెట్లను తీసి పాక్ ఓటమికి ముఖ్య కారణమయ్యాడు.

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వే సంచలన విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. ఆఖరి బంతి వరకూ జరిగిన సస్పెన్స్ థ్రిల్లర్ లో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి పాక్ కు 3 పరుగులు కావాల్సి ఉండగా.. కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడంతో జింబాబ్వే సంచలనాన్ని నమోదు చేసింది.


Tags:    

Similar News