బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. మాల్దీవుల వేకేషన్‌కు వెళ్లొచ్చిన విరాట్ కు పాజిటివ్ వచ్చింది

Update: 2022-06-22 11:33 GMT

విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. మాల్దీవుల వేకేషన్‌కు వెళ్లొచ్చిన విరాట్ కు పాజిటివ్ వచ్చింది అని వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగానే కోహ్లీకి కరోనా పాజిటివ్ వచ్చింది. జూన్ 24 నుంచి లీసెస్టర్‌షైర్‌తో జరిగే భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ అనుకున్న విధంగా జరిగేలా కనిపించడం లేదు. కొవిడ్ -19 బారిన పడిన తర్వాత ఆటగాళ్లను ఓవర్‌లోడ్ చేయొద్దని వైద్యుల సలహా ఉండడంతో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశాలు కష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక భారత బృందంలో మరిన్ని కోవిడ్ కేసులు ఉండవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.కోహ్లీ జట్టులో కీలక సభ్యుడిగా ఉండటంతో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టుకు దూరం కావాల్సి వస్తే అది టీమిండియాకు దురదృష్టకరమే. టెస్టుకు ఇంకా సమయం ఉంది కాబట్టి కోహ్లీ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 1 నుంచి 5 వరకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రీషెడ్యూల్ అయిన ఐదో టెస్టు ప్రారంభం కానుంది. కోవిడ్ -19 వ్యాప్తి ఆందోళనతో గతేడాది సెప్టెంబర్ 10న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కావాల్సిన ఐదో, చివరి టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, హనుమ విహారి, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ తర్వాత టీ20, వన్డే సిరీస్ జరగనుంది. భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో పాల్గొని బెంగళూరు నుంచి ఇంగ్లాండ్‌కు బయల్దేరారు. సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి టీ20 జూలై 7న జరగనుండగా.. రెండో, మూడో టీ20లు వరుసగా జూన్ 9, 10 తేదీల్లో జరగనున్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. మూడు వన్డేలు వరుసగా జూలై 12, 14, 17 తేదీల్లో జరుగుతాయి.


Tags:    

Similar News