Aswin : మూడో టెస్ట్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన అశ్విన్.. రీజన్ ఇదే

భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్ కు స్పిన్నర్ అశ్విన్ దూరమయ్యాడు

Update: 2024-02-17 03:14 GMT

భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్ కు స్పిన్నర్ అశ్విన్ దూరమయ్యాడు. ఇది టీం ఇండియాకు షాకింగ్ న్యూస్. వ్యక్తిగత కారణాలతో రాజ్‌కోట్ లో జరుగుతున్న మూడో మ్యాచ్ నుంచి ఆయన బయలుదేరి ఇంటికి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతోనే అశ్విన్ బీసీీసీఐ అనుమతితో వెళ్లిపోయారు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమెర్జెన్సీ కారణంగా అశ్విన్ మూడో టెస్ట్ నుంచి వైదొలిగాడని బీసీసీఐ తెలిపింది.

తల్లికి అనారోగ్యంతో...
మూడో టెస్ట్ లో బ్యాటింగ్ చేసిన అశ్విన్ 37 పరుగులు చేసి భారత్ కు అత్యధిక స్కోరును సాధించి పెట్టాడు. అయితే అశ్విన్ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెకు దగ్గరగా ఉండటం కోసం మ్యాచ్ నుంచి మధ్యలో వెళ్లి పోయినట్లు తెలిసింది. అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని, ఇటువంటి క్లిష్ట సమయంలో అతడికి టీంతో పాటు బీసీసీఐ అండగా ఉంటుందని ఎక్స్ లో పేర్కొంది.


Tags:    

Similar News