సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్

వన్డే సిరీస్ ను భారతజట్టు కైవసం చేసుకుంది. మూడవ వన్డేలో

Update: 2023-12-22 03:27 GMT

TeamIndia

వన్డే సిరీస్ ను భారతజట్టు కైవసం చేసుకుంది. మూడవ వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 296 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా బౌలర్ల ధాటికి 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయింది సౌత్ ఆఫ్రికా. అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు వికెట్లు తీసి భారత్ కు గెలవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అవేష్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు చెరో రెండేసి, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ 1 చొప్పున వికెట్లు తీశారు. దీంతో 78 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో టోనీ డీ జోర్జి మాత్రమే 81 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు హెండ్రిక్స్ (19), టోనీ డీ జోర్జి(81), డస్సెన్(2), మార్క్రమ్(36), క్లాసెన్(21), డేవిడ్ మిల్లర్(10), ముల్డర్(1), కేశవ్ మహారాజ్ (14), హెండ్రిక్స్(18), విలియమ్స్(2), బర్గర్(1 నాటౌట్) విఫలమయ్యారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసి టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. శాంసన్‌ సెంచరీ, యువ బ్యాటర్లు తిలక్ వర్మ(52), రింకూ సింగ్ (38) రాణించారు. రజత్ పటీదార్ (22), సాయి సుదర్శన్ (10), సంజూ శాంసన్ (108), కేఎల్ రాహుల్ (21), తిలక్ వర్మ (52), రింకూ సింగ్ (38), రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ 3 వికెట్లు, నండ్రె బర్గర్ 2, విలియమ్స్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు. సంజూ శాంసన్ 114 బంతులను ఎదుర్కొని 108 పరుగులు సాధించాడు. ఇందులో 3 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా సంజూ శాంసన్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా అర్షదీప్ సింగ్ అవార్డులను అందుకున్నారు.



Tags:    

Similar News