మన బౌలర్లను ఓ ఆటాడేసుకున్నారు

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా

Update: 2023-12-20 02:19 GMT

INDvsSA

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. టోనీ డి జోర్జి అజేయ సెంచరీతో చెలరేగడంతో 212 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు ఛేదించింది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో డి జోర్జి(119 నాటౌట్), రీజా హెండ్రిక్స్(52) తొలి వికెట్‌కు వీరిద్దరూ 130 పరుగులు జోడించారు. మిగతా బ్యాటర్లలో డస్సెన్ (36), మార్ర్కమ్ (2 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, రింకూ సింగ్ చెరో వికెట్ మాత్రమే తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 46.2 ఓవర్లలో 211 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (62), కెప్టెన్ రాహుల్ (56) అర్ధశతకాలతో రాణించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ (4), తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (17), అక్షర్ పటేల్ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సఫారీ బౌలర్లలో నాండ్రే బర్గర్ 3, బ్యూరాన్ హెండ్రిక్స్ 2, కేశవ్ మహరాజ్ 2, లిజాద్ విలియమ్స్ 1, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన డి జోర్జికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. దక్షిణాఫ్రికా విజయంతో 3 వన్డేల సిరీస్ 1-1తో సమానమైంది.


Full View


Tags:    

Similar News