ఐసీయూలో శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అయ్యర్ కు ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు తేలింది. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని శ్రేయస్ వెనక్కి పరుగెడుతూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఈ క్రమంలో కింద పడటంతో అయ్యర్ ఎడమ పక్కటెముకలకు గాయమైంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్కు చేరుకున్న తర్వాత బీసీసీఐ వైద్య బృందం వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించింది. గత రెండు రోజులుగా శ్రేయస్ ఐసీయూలోనే ఉన్నాడు. వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాత అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించి, వెంటనే ఆసుపత్రిలో చేర్పించినట్లుగా బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అయ్యర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.