టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరబోయే జట్లవే: సచిన్ టెండూల్కర్

Update: 2022-10-21 02:52 GMT

2022- టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో మొదలైంది. ఇక సూపర్-12 మ్యాచ్ లు శనివారం నుండి మొదలు కాబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్లు, ఆతిథ్య ఆస్ట్రేలియా టైటిల్ నిలబెట్టుకోవాలని అనుకుంటూ ఉండగా.. భారత్, పాకిస్తాన్.. ఇతర పెద్ద జట్లకు బలమైన సవాలు విసురుతూ ఉన్నాయి. ముఖ్యంగా సెమీ ఫైనల్ కు ఏ జట్లు వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.. ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయా అని క్రికెట్ అభిమానుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నలుగురు సెమీ-ఫైనలిస్టులకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు.

"నేను స్పష్టంగా భారతదేశం ఛాంపియన్‌గా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు చేరతాయని భావిస్తూ ఉన్నాను. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లను తక్కువగా అంచనా వేయకూడదని.. దక్షిణాఫ్రికా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడింది" అని టెండూల్కర్ ది టెలిగ్రాఫ్‌తో అన్నారు. భారత జట్టుకు చాలా మంచి అవకాశం ఉంది.. ఈ జట్టు బాగా బ్యాలెన్స్‌గా ఉందని అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారత్ ఫైనల్ దాకా వెళుతుందని ఆశిస్తున్నానని భారత్ సచిన్ అన్నారు.
జస్ప్రీత్ బుమ్రా ఈ ఈవెంట్‌ లో లేకపోవడంపై కూడా ఆయన మాట్లాడారు. "అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు లేకపోవడం స్పష్టంగా జట్టుపై ప్రభావం చూపుతుంది. బుమ్రా ప్రధాన ఆటగాళ్ళలో ఒకడు, స్ట్రైక్ బౌలర్.. అద్భుతమైన ఆటగాడు. కానీ సానుకూల విషయం ఏమిటంటే భారత్ మంచి జట్టు.. ఎదురుదెబ్బలు తగిలినా ముందుకు వెళ్ళాలి. అతని స్థానంలో వచ్చిన మహమ్మద్ షమీ కూడా అనుభవజ్ఞుడు, సమర్ధుడు, గతంలో మంచి ప్రదర్శన చేశాడు. అతను ఎంతో విలువైన ఆటగాడు..బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు" అని సచిన్ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News