Asia Cup : ఆసియా కప్ ఛాంపియన్ భారత్.. చిత్తుగా ఓడిన పాక్.. గెలుపునకు హైదరాబాదీయే కారణం
దుబాయ్ లోనిన్న జరిగిన ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ ను చిత్తుగా ఈ టోర్నోలో మూడోసారి ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంలో మన హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ కీలకంగా మారడం విశేషం. ఆసియా కప్ లో భారత్ అస్సలు ఓటమి అనేది లేకుండా ముగించేసింది. దాయాదిని మూడుసార్లు ఈ టోర్నీలో చిత్తుగా ఓడించింది. టీం ఇండియా అంటే టీ 20లలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా.. ఒకరు కాకుంటే.. మరొకరు... వాళ్లు కాకుంటే... ఇంకొకరు... మ్యాచ్ ను తమ వైపునకు తిప్పుకుంటారని ప్రత్యర్థికి తెలియజేసింది. దుబాయ్ లోనిన్న జరిగిన ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది సగర్వంగా ఛాంపియన్ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో మన హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ నిలబడి భారత్ ను గెలిపించాడు.