India and South Africa first T20 : వర్షం మ్యాచ్ ను ఆపేసింది

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.

Update: 2023-12-11 02:04 GMT

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. చాలా సేపు వరకూ వర్షం ఆగుతుందని భావించిన వారికి నిరాశ ఎదురయింది. డర్బన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. తొలి టీ 20 మ్యాచ్ వర్షార్పణం కావడంతో రానున్న రెండు టీంలు ఈ మ్యాచ్‌లు సిరీస్ ను సొంతం చేయనున్నాయి. సొంత గడ్డపై సిరీస్ ను సొంతం చేసుకోవాని సౌతాఫ్రికా తహతహలాడుతుంది.

విదేశీగడ్డపై...
విదేశీ గడ్డపై సత్తా చాటాలని భారత్ కూడా ఉత్సాహంగా ఉంది. యువ క్రికెటర్లు భవిష్యత్ లో నిలదొక్కుకునేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుంది. మొత్తం మూడు టీ 20లు జరుగుతున్న ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం వల్ల నిలిచిపోవడంతో రానున్న రెండు మ్యాచ్ లు సిరీస్ ను నిర్దేశించనున్నాయి. అందుకోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.


Tags:    

Similar News