ఈనెల 28న సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల న ఢిల్లీలో, రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అవకతవకలపై కేంద్ర సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం)కి ఫిర్యాదు చేయనున్నారు

Update: 2023-08-22 14:36 GMT

ఈనెల 28న సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 28 న ఢిల్లీలో, రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అవకతవకలపై కేంద్ర సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం)కి ఫిర్యాదు చేయనున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాల తరహాలోనే తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్లు తొలగించడంపై ఆయన ప్రధానంగా ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా అందజేయనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదులను అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో బాధ్యులైన ప్రతి అధికారిపైనా ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరనున్నారు.

ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ పట్టించుకోవడంలేదని, ఉద్దేశపూర్వకంగానే అనేకచోట్లకు ఓట్లను మారుస్తున్నారని,పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లను నకిలీ డోర్ నెంబర్లు,  చిరునామాలతో ఓటర్ల జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపనున్నారు.

Tags:    

Similar News