ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బంపరాఫర్.. బరువు తగ్గితే రూ.10 లక్షలు

ఇంటి నుంచి పనిచేస్తున్న క్రమంలో చాలామందికి ఊబకాయం సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల..

Update: 2022-09-26 03:28 GMT

కరోనా రాకతో దాదాపు అన్ని సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ ఏడాది నుంచే ఒక్కొక్క కంపెనీ తెరుచుకుంటోంది. కానీ సంస్థలకు చెందిన ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కే పరిమితమై ఉన్నారు. ఇంటి నుంచి పనిచేస్తున్న క్రమంలో చాలామందికి ఊబకాయం సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన ఓ సంస్థ.. బ్రహ్మాండమైన బంపరాఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేయగా.. తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకూడదని భావించిన ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా ఒక ప్రకటన చేసింది.

బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని సంస్థ సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ఫిట్‌నెస్ ట్రాకర్ పరికరాల్లో ఉద్యోగులు రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామన్నారు. బరువు తగ్గిన ఉద్యోగుల పేర్లను లక్కీ డ్రా తీసి రూ.10 లక్షల బహుమతిని అందిస్తామని తెలిపారు.


Tags:    

Similar News