ఢిల్లీ బాంబు పేలుడు కేసులో మరో అరెస్ట్
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి కారు బాంబును తయారు చేసిన కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అనంతనాగ్లో జసీర్ బిలాల్ వాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఆత్మాహుతి బాంబర్ ఉమర్కు కారు బాంబును అందించింది బిలాలేనని అధికారులు తెలిపారు.
బాంబు తయారు చేసిన...
డ్రోన్లు, రాకెట్ల ద్వారా కూడా దాడులకు జసీర్ బిలాల్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇదే కేసులో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన అమీర్ రషీద్ అలీని ఆదివారం ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పేలుడుకు ఉపయోగించిన కారు అమీర్ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ 10న జరిగిన ఈ పేలుడు ఘటనపై ఎన్ఐఏ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.