మధ్యాహ్న భోజన పథకం ద్వారా 11.46 కోట్లను మాయం చేసిన ప్రధానోపాధ్యాయుడు

మధ్యాహ్న భోజన పథకం ద్వారా 11.46 కోట్లను మాయం చేసిన ప్రధానోపాధ్యాయుడు

Update: 2022-08-03 05:46 GMT

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లోని ప్రాథమిక విద్యా విభాగానికి చెందిన ఒక పాఠశాల ప్రిన్సిపాల్ మధ్యాహ్న భోజనం (MDM) పథకంలో భాగంగా వచ్చిన నిధులలో ఏకంగా ₹ 11.46 కోట్లను మాయం చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (NGO)ని నకిలీ పత్రాలను ఉపయోగించి ఏర్పాటు చేసాడు. బ్యాంకుల అధికారులు, ఇతర సిబ్బంది సహాయంతో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన డబ్బులతో ₹ 11.46 కోట్లు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించాడని ఆగ్రా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) తెలిపారు. "ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ప్రాథమిక విద్యాశాఖలో ఉన్న ఉపాధ్యాయుడు చంద్రకాంత్ శర్మపై ఈ అవినీతి కేసు నమోదైంది. షికోహాబాద్ నివాసి. ఫిరోజాబాద్ జిల్లా తుండ్లలోని జాజుపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు." అని అలోక్ శర్మ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (విజిలెన్స్) తెలిపారు.

ఆగ్రాలోని విజిలెన్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రాథమిక విద్యాశాఖ, బ్యాంకులకు చెందిన మరికొంత మంది ఉద్యోగులతో పాటు చంద్రకాంత్ శర్మపై జూలై 27న కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిరోజాబాద్‌లోని షికోహాబాద్‌లో రిజిస్టర్ చేయబడిన 'సరస్వత్ అవాసీయ శిక్షా సేవా సమితి' అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చంద్రకాంత్ శర్మ ఆ డబ్బును స్వాహా చేశాడు. "2007లో ఆగ్రాలోని ఫర్మ్స్, సొసైటీలు, చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయబడింది. అతను NGO రిజిస్టర్ చేయడానికి నకిలీ రేషన్ కార్డులు, ID కార్డులను ఉపయోగించాడు" అని అలోక్ శర్మ చెప్పారు.
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ప్రకారం, ఉపాధ్యాయుడు తన తండ్రిని ఎన్జీవో అధ్యక్షుడిగా, అతని తల్లిని మేనేజర్, అతని భార్యను కోశాధికారిగా ప్రకటించాడు. NGO లో ఇతర కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా పలు పదవుల్లో నియమించాడు. అతను తన తల్లితో సహా కొంతమంది NGO సభ్యులు చనిపోయారని తెలిపాడని పోలీసులు గుర్తించారు.


Tags:    

Similar News