India : రష్యాతో భారత్ కొత్త వ్యూహం
భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి
భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంతురోవ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సహకారం, కనెక్టివిటీ మార్గాలు, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు లోతుగా చర్చించారు. 2025 డిసెంబరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం రోడ్మ్యాప్ అమలుపై మాంతురోవ్ ప్రధానికి వివరించారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో...
ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశానికి అవసరమైన ఎరువులు, ముడి చమురు మరియు ఎల్పీజీ సరఫరాలో రష్యా అగ్రగామిగా నిలుస్తోంది. వాణిజ్య రంగంలో సాధించిన పురోగతిని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచే ఎరువుల సరఫరాలో రష్యా అందిస్తున్న సహకారాన్ని మాంతురోవ్ ప్రధానికి వివరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించి, ద్వైపాక్షిక వ్యాపారాన్ని మరింత సమతుల్యం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలు రూపొందుతున్నాయి.