కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో నిర్మలా సీతారామన్ సెల్ఫీ

Update: 2022-11-11 02:58 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సెల్ఫీ దిగారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం(నవంబర్‌ 10)తో ఎన్నికల ప్రచారం ముగిసింది. షిమ్లాలో నిర్వహించిన రోడ్‌షోలో బీజేపీ నేత నిర్మలా సీతారామన్‌ ఉల్లాసంగా పాల్గొన్నారు. మరో ప్రాంతానికి ఆమె వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు కనిపించారు. అప్పటికే వాళ్లంతా ప్రియాంక గాంధీ వాద్రా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమెను చూసి చేతులు, తమ మెడలోని కండువాలు ఊపారు. అది గమనించిన సీతారామన్‌ కాన్వాయ్‌ను ఆపించి, వాళ్ల దగ్గరకు వెళ్లారు. వాళ్లతో కాసేపు మాట్లాడి.. సెల్ఫీలు కూడా దిగారు. సీతారామన్‌తో సెల్ఫీలు దిగడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చేయడంపై కార్యకర్తలను షిమ్లా రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ చీఫ్‌ వివరణ కోరారు. సీతారామన్‌ మహిళలను తలెత్తుకునేలా చేశారని, అందుకే ఆమెతో సెల్ఫీలు దిగామని ఆ కార్యకర్తల ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News