భారత్ లో కరోనా అప్ డేట్

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 7,992 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 393 మంది మరణించారు

Update: 2021-12-11 04:38 GMT

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 7,992 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 393 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,41,14,331 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 93,277 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

కోలుకుంటున్న వారు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,74,744 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,75,128 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,31,99,87,257 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News