మణిపూర్‌లో భూకంపం

మణిపూర్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 6.14 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి

Update: 2023-02-04 06:12 GMT

మణిపూర్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 6.14 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ఉదయాన్నే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతగా నమోదయింది. ఈ భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

ప్రాణ, ఆస్తినష్టం...
ఉఖ్రుల్‌లో ఉదయం ఆరు గంటలకు ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ,ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి హర్యానా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలోనూ భూకంపం సంభవించింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News