ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ తెలిపింది. దసరా, దీపావళికి ముందు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఉద్యోగులకు

Update: 2023-10-18 13:14 GMT

మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ తెలిపింది. దసరా, దీపావళికి ముందు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు మోడీ సర్కార్‌ దసరా కానుకగా డియర్‌నెస్‌ అలవెన్స్‌లో 4 శాతం పెంచింది. దీంతో 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపునకు ఆమోదం తెలిపింది. ఇందులో కరువు భత్యం పెంపునకు ఆమోదం లభించింది. కరువు భత్యం పెంపుతో పాటు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను కూడా అక్టోబర్ నెల జీతంతో పాటు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాలని నిర్ణయించింది.

ఇటీవలి కాలంలో ఆహార ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. అయితే, రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న సెప్టెంబర్‌లో 5.02 శాతానికి పడిపోయింది. అంతకుముందు జూలై 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి చేరుకుంది. ఆగస్టులో 9.94 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 6.56 శాతానికి తగ్గింది. కానీ గోధుమలు, బియ్యం, పప్పులు, పంచదార ధరలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. దీని కారణంగా వంటగది బడ్జెట్ దిగజారింది. అటువంటి పరిస్థితిలో, డియర్‌నెస్ అలవెన్స్ పెంపు నుండి ఉపశమనం పొందవచ్చు.

Tags:    

Similar News