కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Update: 2026-01-19 05:43 GMT

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు కోట్ల రూపాయల వరకూ ఉచిత ఇన్సూరెన్స్, చౌకగా రుణాలు అందించాలని నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక జీరో-బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని లాంచ్ చేసింది. గ్రూప్ A, B మరియు C కేడర్ల ఉద్యోగులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం జీతం వచ్చే ఖాతా మాత్రమే కాదు, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సేవల సమాహారంగా ఉంది. ఈ అకౌంట్ ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలుఏంటంటే.... ఇన్సూరెన్స్ సౌకర్యం తో పాటు వ్యక్తిగత ప్రమాద భీమా కల్పిస్తారు. వ్యక్తిగత బీమా కిం ప్రమాదవశాత్తు మరణిస్తే కోటిన్నర వరకు ఇన్సూరెన్స్ చెల్లించనున్నారు. . ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా కల్పించనున్నారు. విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగితే 2 కోట్ల వరకు చెల్లించనున్నారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవిస్తే కోటిన్నర వరకు రక్షణ కల్పించింది. 20 లక్షల వరకు టర్మ్ లైఫ్ కల్పించింది

రుణ సౌకర్యం కూడా...
బీమాను తక్కువ ప్రీమియంతో టాప్-అప్ సదుపాయం కల్పించింది. ఉద్యోగి మరియు కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య బీమా ప్లాన్ అమలు చేయనుంది. రుణ ప్రయోజనాలు కూడా లక్పించింది. బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ కు అనుమతించింది. కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ ఛార్జీలు జీరోగా నిర్ణయించారర. ఉచిత లావాదేవీలు: RTGS, NEFT, UPI మరియు చెక్ బుక్ లావాదేవీలన్నీ పూర్తిగా ఉచితం. తక్కువ వడ్డీ తో గృహ రుణాలను, విద్యా రుణాలను, వాహన రుణాలను, వ్యక్తిగత రుణాలను అందించనున్నారు. లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలలో రాయితీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతతను అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం ఉన్న శాలరీ అకౌంట్లను ఉద్యోగి సమ్మతితో ఈ కొత్త ప్యాకేజీకి మార్చుకోవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.


Tags:    

Similar News