ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న లైగర్..

లైగర్ కన్నా ముందే వచ్చిన బింబిసార, కార్తికేయ 2 ఇంకా ఓటీటీల్లో రాలేదు కానీ.. లైగర్ మాత్రం విడుదలైన నెలరోజుల్లోనే

Update: 2022-09-22 07:34 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ- బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొంది, ఆగస్టు 25న పాన్ ఇండియా సినిమాగా విడుదలైన "స్పోర్ట్స్ డ్రామా" లైగర్. ఈ సినిమాలో విజయ్ కి తల్లిగా రమ్యకృష్ణ నటించగా.. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ముఖ్యపాత్ర పోషించారు. కానీ.. లైగర్ అభిమానుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. భారీ అంచనాల మధ్య విడుదలై ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుని థియేటర్ల నుంచి అవుట్ అయింది.

లైగర్ కన్నా ముందే వచ్చిన బింబిసార, కార్తికేయ 2 ఇంకా ఓటీటీల్లో రాలేదు కానీ.. లైగర్ మాత్రం విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. సాధారణంగా ఓటీటీలో విడుదలయ్యే పాన్ ఇండియా సినిమాకి సంబంధిత ఓటీటీ సంస్థ ప్రమోషన్ చేస్తుంది. ముందు విడుదల తేదీ, ఓటీటీ ట్రైలర్, ఆ తర్వాత సినిమా స్ట్రీమింగ్. కానీ లైగర్ కి అవేమీ లేవు. కేవలం ఒక చిన్న ట్వీట్ తో లైగర్ స్ట్రీమింగ్ మొదలైంది. నేటి నుంచి డిస్నీ+ హాట్ స్టార్ లో లైగర్ స్ట్రీమ్ అవుతోంది.


Tags:    

Similar News