ముందు పూలవర్షం కురిపించి.. తర్వాత కోడిగుడ్లు విసిరారు : చిరంజీవి

ఆ వెలితిని చిరంజీవి మరో టాక్ షో ద్వారా తీర్చారు. అదే సింగర్ స్మిత హోస్ట్ గా చేస్తున్న 'నిజం విత్ స్మిత' అంటూ..

Update: 2023-02-08 11:36 GMT

nijam with smitha

కరోనా మహమ్మారి తర్వాత.. ఎంటర్టైన్ మెంట్ రంగం రూపురేఖలు మారిపోయాయి. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే చాలా ఓటీటీలు పుట్టుకొచ్చాయి. వాటిలో కేవలం సినిమాలే కాకుండా డాన్స్ షో, సింగింగ్, కుకుంగ్, టాక్ షో లతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే టాప్ ర్యాంకింగ్స్ లో నిలిచింది. అయితే.. ఈ షోకి చిరంజీవి ఇంకా రాలేదన్న వెలితి ఉంది.

ఆ వెలితిని చిరంజీవి మరో టాక్ షో ద్వారా తీర్చారు. అదే సింగర్ స్మిత హోస్ట్ గా చేస్తున్న 'నిజం విత్ స్మిత' అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఆమె రెడీ అయింది. ఈ షో ద్వారా రాజకీయ, పబ్లిక్ సర్వెంట్లు ఎంతో మంది ప్రముఖుల జీవితాల్లోని ఆసక్తికర విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆమె చేస్తోంది. ఈ టాక్ షో మెగాస్టార్ చిరంజీవితో ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 10న తొలి ఎపిసోడ్ సోని లివ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ సందర్భంగా ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో చిరుకు స్మిత ఎన్నో ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. కాలేజ్ డేస్ లో మీ ఫస్ట్ క్రష్? స్టార్ డమ్ అనేది కొంతమందికే.. ఆ స్థాయికి వెళ్లాలంటే ఎన్నో అవమానాలు, అనుమానాలు ఉంటాయి. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? వంటి ప్రశ్నలు చిరుకు ఎదురయ్యాయి. ఈ క్రమంలో, తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ఘటనను చిరంజీవి చెప్పారు.
జగిత్యాలలో పర్యటించినప్పుడు తొలుత పైనుంచి తనపై పూలవర్షం కురిసిందని.. కొంచెం ముందుకు వెళ్లగా కోడిగుడ్లతో కొట్టారని చెప్పారు. మళ్లీ ఒక వరప్రసాద్ మెగాస్టార్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉందంటారా? అనే ప్రశ్నను స్మిత వేసింది. ఎంతో ఆసక్తికరంగా ప్రోమోని కట్ చేశారు. పూర్తి ఎపిసోడ్ విడుదల కానున్న 10వ తేదీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నేచురల్ స్టార్ నాని, అల్లరి నరేష్, అనిల్ రావిపూడి, సాయిపల్లవిలు కూడా హాజరైనట్లు సమాచారం. చిరంజీవి ఎపిసోడ్ తర్వాత వరుసగా.. వీరి ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.
Full View


Tags:    

Similar News