మెగాస్టార్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

ఈ విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్..

Update: 2022-11-21 03:27 GMT

indian film personality of the year 2022

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలన చిత్రోత్సవం నవంబర్ 20న ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. గోవా వేదికగా జరుగుతున్న ఈ చలన చిత్రోత్సవ వేడుకలు నవంబర్ 28 వరకూ కొనసాగనున్నాయి.
తనకు ఈ అవార్డును ప్రకటించడంపై చిరంజీవి స్పందించారు. ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి ఎంపిక చేయడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన తనకెంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.




Tags:    

Similar News