Dhanush : ధనుష్ కొడుకులు రీసెంట్ ఫోటో చూశారా.. అచ్చు ఒకేలా..

హీరో ధనుష్ కొడుకులు రీసెంట్ ఫోటోలు చూశారా. తండ్రి ఆస్తులు బదులు పోలికలను సగం సగం పంచుకున్నారు.

Update: 2024-01-27 06:34 GMT
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ తన స్టార్‌డమ్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాగా రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకొని, ఇటీవల విడాకులతో విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఒకరి పేరు 'యాత్ర', మరొకరి పేరు 'లింగ'. ఈ ఇద్దరికీ సంబంధించిన పలు ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా కొన్ని సరికొత్త ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఐశ్వర్య దర్శకురాలిగా 'లాల్ సలాం' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబందించిన ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఇక అమ్మ తెరకెక్కించిన సినిమా ఆడియో లాంచ్ కి కొడుకులు యాత్ర, లింగ ముఖ్య అతిథులుగా వచ్చారు.
ప్రస్తుతం వారు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అవి చూసిన ఆడియన్స్ ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైన కొడుకులు తండ్రి ఆస్తులు పంచుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం తండ్రి పోలికలను సగం సగం పంచుకున్నారు.. అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్ ఆ ఫోటోకి నిజంగా అప్ట్ అని చెప్పాలి. మరి ఆ ఫోటోని మీరు చూసేయండి.
Tags:    

Similar News