భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

ఈరోజు సాయంత్రం (ఫిబ్రవరి 21) భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా తెలంగాణ..

Update: 2022-02-21 06:50 GMT

పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఈనెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు సాయంత్రం (ఫిబ్రవరి 21) భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కావాల్సి ఉంది. ఈ ఈవెంట్ లోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

కానీ.. ఈరోజు ఉదయం ఏపీమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో.. సంతాపం ప్రకటిస్తూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. తమ నిర్మాణ సంస్థ తరపున గౌతమ్ రెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించింది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేయడంపై పవన్ అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 



Tags:    

Similar News