'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూటింగ్ పూర్తి.. 25న థియేటర్లలోకి !

'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా అలాంటిదే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలవ్వగా..

Update: 2022-02-14 13:00 GMT

కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ - రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ.. చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక సినిమా విషయానికొస్తే.. శర్వానంద్ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసే సినిమాల నుంచి మంచి మెసేజ్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను రీచ్ అయ్యేలా సినిమాలు చేస్తుంటారు.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా అలాంటిదే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడవాళ్ల మధ్యలో పెరిగిన ఓ అబ్బాయి పెళ్లికోసం పడే పాట్లను దర్శకుడు అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో.. సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈనెల 25వ తేదీన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.


Tags:    

Similar News