బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు

Update: 2024-05-04 01:43 GMT

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇందులో ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ లో వాహనంపై బాంబు దాడి చేయగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఎనిమిది మంది వరకూ గాయాలయినట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కారులో వస్తుండగా...
ఖుజ్దూర్ నగర్ శివార్లలో రోడ్డు పక్కన ఈ బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు.ది. కారులో ఉన్న జర్నలిస్ు మౌలానా సిద్ధిఖీతో పాటు ఈ పేలుడులో మరో ఇద్దరు బాటసారులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పేలుడు ఎవరు చేశారన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు పేలుడు ధాటికి ఛిద్రమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News