పాక్ లో బాంబు పేలుడు.. భారతీయ వస్తువులు అమ్మే చోటే?

పాకిస్థాన్ లో భారీ పేలుడు జరిగింది. పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2022-01-20 13:25 GMT

పాకిస్థాన్ లో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి. లాహోర్ లోని అనార్కలీ మార్కెట్ పాన్ మండీ దగ్గర ఈ పేలుడు సంభవించింది. నిత్యం ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. రద్దీ ఉండే ప్రాంతాన్నే దుండుగులు ఎంచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏ ఉగ్రవాద సంస్థ?
బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో ఎక్కవ భారతీయ వస్తువులు అమ్ముతుండటంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పేలుడుకు తామే కారణమని ఈ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకూ ప్రకటించుకోలేదు. దీంతో లాహోర్ పోలీసులు బాంబు పేలుడుపై దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News