పేట్రేగిన ఉగ్రవాదులు.. 32 మంది సజీవదహనం

మాలి దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండియాగా సమీపంలో రహదారిపై వెళ్తున్న బస్సును అడ్డుకుని మెరుపుదాడులు చేశారు

Update: 2021-12-04 08:03 GMT

మాలి దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండియాగా సమీపంలో రహదారిపై వెళ్తున్న బస్సును అడ్డుకుని మెరుపుదాడులు చేశారు ఉగ్రవాదులు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు.. బండియాగ్రాలోని ఓ మార్కెట్‌కు సోంగో విలేజ్‌కు చెందిన ప్రజలు వెళ్తున్నారు. వారానికి రెండ్రోజులు మాత్రమే అక్కడికి వెళ్లే బస్సులో శుక్రవారం సోంగోతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మహిళలు మార్కెట్లో పనిచేసేందుకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఆ బస్సునే టార్గెట్ గా చేసుకున్నారు. వెళ్తున్న బస్సును ఆపి.. డ్రైవర్ ను హతమార్చారు. ఆ తర్వాత బస్సు టైర్లలో గాలి తీసేశారు.

విచక్షణారహితంగా కాల్పులు...
భయంతో బిక్కు బిక్కుమంటూ బస్సులో కూర్చున్న అమాయక ప్రయాణికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం పెట్రోల్ పోసి బస్సుకు నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఉగ్రదాడిలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాల్లో మృతదేహాలు చెల్లా చెదురుగా పడి భయంకరమైన వాతావరణం కనిపిస్తోంది. మాలిలో ఉగ్రవాదం పెరిగిపోతోంది. ముఖ్యంగా నార్త్ మాలిలో ఉగ్రదాడులు రెట్టింపవుతున్నాయి. ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాట్లతో అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తాజాగా జరిగిన ఈ ఉగ్రదాడిపై అక్కడి ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం గమనార్హం.


Tags:    

Similar News