అమెరికా ఆదాయానికి భారతీయుల భారీ సాయం

అమెరికాలోని ప్రవాస భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు.

Update: 2025-07-11 14:00 GMT

అమెరికాలోని ప్రవాస భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే సంపన్న దేశంగా ఉన్న అమెరికాను మరింత సంపన్న దేశంగా మారుస్తున్నారు మనోళ్లు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘అమెరికాస్‌ రిచెస్ట్‌ ఇమిగ్రెంట్స్‌-2025’ జాబితా ప్రకారం మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నారు. వీరిలో 12 మంది భారతీయులే కావడం విశేషం. ఈ సంఖ్యా పరంగా ఇజ్రాయెల్‌ను భారతదేశం అధిగమించింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల ఈ జాబితాలో నిలిచారు. సైబర్‌ భద్రతా సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ను నిర్వహిస్తున్న నికేశ్‌ అరోరా కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు. 17.9 బిలియన్ డాలర్ల సంపదతో జయ్‌ చౌధ్రీ అగ్రస్థానంలో ఉన్నారు

Tags:    

Similar News