హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. రెండుప్రాంతాల్లో..

సుమేష్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తూ.. పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలోనూ..

Update: 2023-06-23 06:38 GMT

drugs in hyderabad

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. రెండు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయదారులు పోలీసులకు పట్టుబడ్డారు. వనస్థలిపురంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ.. కేరళకు చెందిన సుమేష్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. సుమేష్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తూ.. పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలోనూ అతడు డ్రగ్స్ కేసులో అరెస్టైనట్లు పోలీసులు తెలిపారు. టౌలీచౌకీలో డ్రగ్స్ అమ్ముతూ మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇర్ఫాన్ అనే యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడి నుండి 8.56 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశారు.

నిన్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కెన్యా నుంచి వచ్చిన మహిళ నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మూడు విస్కీ బాటిళ్లలో కొకైన్ ను తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.38 కోట్లు ఉంటుందన్నారు. ఆ బాటిళ్ల నుంచి 2.25 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకుని, సదరు మహిళను అరెస్ట్ చేశారు. జూన్ 15న కూడా కెన్యా నుంచి వచ్చిన మహిళ నుంచి కొకైన్ కలిపిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News