టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ కార్పొరేటర్

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ టీఆర్ఎస్ లో చేరారు

Update: 2021-12-28 04:06 GMT

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్ లో చేరడంతో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమయిందనే చెప్పాలి. గత ఏడాది చివరలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఊహించిన దానికన్నా ఎక్కువ స్థానాలను గెలిచింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. దీంతో బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ వల వేసింది. వారిని తమ గూటికి రప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

బీజేపీ ఆందోళన....
అందులో భాగంగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ టీఆర్ఎస్ లో చేరారు. ఆయనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానించి పార్టీ కండువా కప్పేశారు. దీనిపై బీజేపీ మండిపడుతుంది. కార్పొరేటర్ నరేంద్ర కుమార్ ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాను టీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనై పార్టీలో చేరానని నరేంద్ర కుమార్ తెలిపారు.


Tags:    

Similar News