ఫ్యాక్ట్ చెక్: భారత సైనికుల దేహాలని చూపుతోంది అంటూ వైరల్ అవుతున్న వీడియో పాతది, 2011 సంవత్సరం నాటిది
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు మే 7, 2025న పాకిస్తాన్, పాకిస్తాన్
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు మే 7, 2025న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం చేసిన దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల చేతుల్లో పలువురు మహిళల భర్తలు చనిపోయారు. ఆ మహిళలకు న్యాయం జరిగేలా ఈ పేరు పెట్టారు. హిందీలో సిందూర్ అంటే నుదుటున బొట్టు, దీనిని హిందూ మహిళలు తమ వివాహానికి చిహ్నంగా తలపై పెట్టుకుంటారు. సిందూర్లోని ఒక 'O' మాత్రం కుంకుమతో ఉంది. భారత మహిళల నుదుటున చెరిపేసిన బొట్టుకు ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్ ప్రతీకార దాడులకు తెగబడితే అందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారతదేశ సరిహద్దు రాష్ట్రాలను కోరారు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ దళాల సీమాంతర కాల్పుల్లో 12 మంది పౌరులు మరణించారు, 2 CRPF సైనికులు సహా 50 మంది గాయపడ్డారు.