ఫ్యాక్ట్ చెక్: కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య సమర్ధకుడిపై ఇటీవల ఐటీ దాడులు చూపుతున్నాయి అంటూ వైరల్ అవుతున్న చిత్రాలలో ఒకటి పాతది

కర్నాటకలోని ఆదాయపు పన్ను శాఖ అధికారులు అక్టోబర్‌ 2023 లో పలువురిపై దాడులు నిర్వహించి, రూ.50 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు

Update: 2023-10-26 12:55 GMT

ITRaidKarnataka

కర్నాటకలోని ఆదాయపు పన్ను శాఖ అధికారులు అక్టోబర్‌ 2023 లో పలువురిపై దాడులు నిర్వహించి, రూ.50 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నివేదికల ప్రకారం, దాడులు నిర్వహించిన వ్యక్తులలో కాంట్రాక్టర్, అతని కుమారుడు, జిమ్ శిక్షకుడు, ఇంకా ఆర్కిటెక్ట్ ఉన్నారు. వీరిలో కొందరు పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఐటీ శాఖ ఆరోపించింది.

పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం అయిన వార్త వైరల్ అయిన తర్వాత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్ధకుడిపై ఇటీవల జరిగిన ఐటీ దాడిని చూపిస్తోందంటూ నగదు కట్టల ముందు వ్యక్తులు కూర్చుని లెక్కిస్తున్న చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.

ఫేస్‌బుక్ వినియోగదారుడు వైరల్ చిత్రాన్ని హిందీ క్యాప్షన్‌తో షేర్ చేశాడు

“इनकम टैक्स के छापे में मिले 94 करोड़ कैश और 8 करोड़ के गहने ! कर्नाटक, तेलंगाना, दिल्ली और आंध्र प्रदेश में 55 से अधिक स्थानों पर ठेकेदारों और रियल एस्टेट डेवलपर्स पर चल रही छापेमारी में आयकर विभाग ने लगभग 94 करोड़ रुपये नकद जब्त किए हैं ! साथ ही 8 करोड़ रुपये के सोने और हीरे के आभूषण और 30 लक्जरी घड़ियां भी बरामद की हैं ! इसी तरह यूपी में आयकर विभाग की बेनामी संपत्ति यूनिट ने बड़ी कार्रवाई करते हुए 11 प्रॉपर्टीज को कुर्क किया है, जो दलितों की थीं !!”

అనువదించినప్పుడు, “ఆదాయపు పన్ను దాడులలో 8 కోట్ల విలువైన 94 కోట్ల నగదు మరియు నగలు దొరికాయి! కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని 55కి పైగా ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లపై జరుగుతున్న దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ దాదాపు రూ.94 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది! 8 కోట్ల రూపాయలతో పాటు బంగారు, వజ్రాల ఆభరణాలు, 30 విలాసవంతమైన వాచీలు కూడా రికవరీ! అదేవిధంగా, యుపిలోని ఆదాయపు పన్ను శాఖకు చెందిన అనామక ఆస్తుల విభాగం పెద్ద చర్యలు చేపట్టింది, దళితులకు చెందిన 11 ఆస్తులను జప్తు చేసుకుంది !!

Full View

చాలా మంది వినియోగదారులు వైరల్ ఇమేజ్‌తో మరొక చిత్రాన్ని కలిపి సోషల్ మీడియాలో ఐటీ రైడ్ వార్తలను పంచుకున్నారు. ఈ చిత్రాలపై హిందీలో ఉన్న క్లేయిం “कर्नाटक में आईटी छापे में 42 करोड़ रुपये नकद मिले कर्नाटक की पिछली बीजेपी सरकार पर 40% कमीशन का आरोप लगाने वाले ठेकेदार अंबिकापति पर सूत्रों का कहना है कि यह आगामी तेलंगाना चुनाव के लिए हैदराबाद जा रहा था। अंबिकापति की पत्नी एक पार्षद थीं और एक #कांग्रेस विधायक की करीबी थीं I “

అనువదించబడినప్పుడు, “కర్ణాటకలోని గత బిజెపి ప్రభుత్వంపై 40% కమీషన్ ఆరోపణలు చేసిన కర్ణాటక కాంట్రాక్టర్ అంబికాపతి నివాసంలో ఐటి దాడిలో రూ. 42 కోట్ల నగదు దొరికింది. త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల కోసం హైదరాబాద్‌కు డబ్బు తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంబికాపతి భార్య కౌన్సిలర్ మరియు #కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సన్నిహితురాలు."


Full View


Full View

వైరల్ చిత్రాన్ని ఆజ్ తక్ కూడా షేర్ చేసింది.

నిజ నిర్ధారణ:

వాదన పాక్షికంగా అబద్దం.

వైరల్ అయిన చిత్రం పాతది, 2021 సంవత్సరానికి చెందినది. కాన్పూర్‌లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసినప్పుడు నగదు రికవరీని చూపుతుంది.

చిత్రం -1



గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండు చిత్రాలను శోధించినప్పుడు, వైరల్ చిత్రం 2021 సంవత్సరానికి చెందినదని మేము కనుగొన్నాము. డిసెంబర్ 24, 2021న ప్రచురించిన జీ న్యూస్ కథనం ప్రకారం, అఖిలేష్ యాదవ్ సన్నిహితుడు, కాన్పూర్‌లోని పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసిన చిత్రం చూపుతోంది.

హిందుస్థాన్ టైమ్స్‌లోని కథనం ప్రకారం, కాన్పూర్‌కు చెందిన పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్‌ పై పన్ను దాడులలో రూ. 150 కోట్లకు పైగా నగదు లభించింది. ఆనంద్‌పురిలోని జైన్ ఇంట్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) అధికారులు నగదును ఉంచడానికి 57 పెద్ద టిన్ బాక్స్‌లను కొనుగోలు చేశారని, గట్టి భద్రత మధ్య దాని రవాణా కోసం కంటైనర్ ట్రక్కును అద్దెకు తీసుకున్నారని చెప్పారు.

టైంస్ నౌ న్యూస్ ప్రచురించిన వీడియో నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్ వ్యాపారవేత్త పీయూష్ జైన్‌ను 72 గంటల పన్ను దాడి తర్వాత అరెస్టు చేశారు. వ్యాపారి నుంచి దాదాపు రూ.250 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) సంయుక్త బృందం చేసిన దాడి తరువాత కాన్పూర్‌లోని ఒక పెర్ఫ్యూమ్ వ్యాపారి నుండి స్వాధీనం చేసుకున్న నోట్లను లెక్కించడానికి ఐదు యంత్రాల సహాయం తీసుకున్నారు.

చిత్రం -2



సోషల్ మీడియాలో మొదటి చిత్రం తో పాటు ప్రచురించిన మరో చిత్రం కోసం శోధించినప్పుడు, ఆ చిత్రం నిజంగా కర్ణాటకలో ఇటీవల జరిగిన ఐటి దాడికి సంబంధించినదని మేము కనుగొన్నాము.

అందువల్ల, కర్ణాటక లో జరిగిన ఐటి దాడూలకు సంబంధించింది అంటూ షేర్ చేసిన చిత్రాలలో ఒకటి పాతది అయినందువల్ల వాదన పాక్షికంగా అబద్దం. కాన్పూర్‌లోని ఒక వ్యాపారవేత్త ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసిన చిత్రం 2021 సంవత్సరానికి చెందిన చిత్రం అది. 

Claim :  The viral images show a recent IT raid on Chief Minister Siddaramaiah’s supporter in Karnataka
Claimed By :  Social media users
Fact Check :  Partly False
Tags:    

Similar News